స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 's/o సత్యమూర్తి' ఏప్రిల్ 9న అత్యధిక ధియోటర్స్ లొ విడుదలవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o సత్యమూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.ఇటీవలే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో సూపర్హిట్ అయ్యింది. ఈ సక్సస్ ని అభిమానులందరితో పంచుకోవటానికి ఏప్రిల్ 6న విజయవాడలో 's/o సత్యమూర్తి' యూనిట్ అందరూ హజరయ్యి గ్రాండ్ గా ఆడియో సక్సస్మీట్ ని నిర్వహించారు. మెగాఅభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ హజరయ్యి ఈ ఫంక్షన్ ని ఘనవిజయం చేశారు. ఈ ఫంక్షన్ కి స్టైలిష్స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ ఆదాశర్మ,దర్శకుడు త్రివిక్రమ్,బ్రహ్మనందం,ఆలి,సంపత్ లతో పాటు సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరేళ్ళ, నిర్మాత ఎస్.రాధాకృష్ణ గారు హజరయ్యారు.

No comments:
Post a Comment